Saturday, June 27, 2009

ముస్లిం రజ్జబ్ నెలరోజునే భాగ్యనగర బోనాలు ప్రారంభం

ఆషాడం వచ్చిందంటే చాలు...... తెలంగాణా ప్రాంతంలో ప్రతి ఇంతా బోనాల హడావిడి కనిపిస్తుంది. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతి ఆషాడంలోను అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ బోనాల పండుగ ఉత్సవాలు ఈనాటివి కావు. ఆషాఢమాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే ఈ బోనాల పండుగ ఉత్సవాలు .......చివరి ఆదివారం వరకు.... నిత్యం ప్రత్యేకమైన పూజలతో జరుగుతాయి.
ప్రతి గురు, ఆదివారాలలో భారీ సంఖ్యలో భోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. మూడో ఆదివారం జూలై 12 న సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం లో అమ్మవారికి లష్కర్ బోనాలు సమర్పిస్తారు. తరువాత వచ్చే.. చివరి ఆదివారం నాడు పాతనగరం లోని లాల్ దర్వాజా మాతా సింహవాహిని ఆలయంలో సంబరాలు నిర్వహిస్తారు..... ఇదే రోజున జంట నగరాలలోని 116 ఆలయాలలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.

బోనాలు అంటే ఏమిటి?

భక్తులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలను సామూహికంగా సమర్పించే ఈ అపురూపమైన దృశ్యాలు చూడ చక్కగా వుంటాయి. పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఆరే మైసమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ తదితర పేర్లతో కొలువైవున్న ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు వారి సోదరుడైన పోతురాజు తోడుగా రాగా లక్షలాది భక్తులు ప్రతి ఆషాఢ మాసం లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని చల్లగా చూడమని మొక్కుతారు. ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారు చేసే నైవేద్యమే బోనాలు. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో వుంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలు అంటారు.

ఇక అసలు ముఖ్యమైనది భవిష్యవాణి...

బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పటం. రంగం చెప్పటమంటే భవిష్యవాణిని వినిపించటమే. రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? నగరంలో ప్రజల స్థితిగతులు ఎలా వుండబోతున్నాయి ... మొదలైన వివరాలను చెప్పడమన్నమాట. ఇలా చెప్పేది ఒక మహిళ. ఒక కుటుంబానికి చెందినా అవివాహిత మాత్రమే.... తరతరాలుగా ఇలా రంగం చెప్పటం సంప్రదాయంగా వస్తోంది.. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభోగంగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. గర్భగుడి లోని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంశను... తనలో ఇముడ్చుకుందా అన్నట్లుగా...... పచ్చి కుండపై పాదం మోపి భక్తి పారవశ్యంతో ఊగిపోతూ.... భవిష్యత్తును..... వివరిస్తుందా మహిళ.

సికింద్రాబాద్ మహంకాళి జాతరకు 11 వ రోజునే సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది. ఈ గ్రహణానికి 3 రోజుల ముందుగా వచ్చే ఆదివారం అనగా 19 జూలై తో బోనాల పండుగ ముగియనుంది.... శ్రీ విరోధి నామ సంవత్సరంలో బోనాల పండుగ జూన్ 25 గురువారం పుష్యమి నక్షత్రం ( శని స్వనక్షత్రం ) రోజున ప్రారంభమయ్యాయి. అదే రోజున ముస్లిం సోదరుల రజ్జబ్ నెల కూడా ప్రారంభమైంది. ఇదే పుష్యమిలో ( శని స్వనక్షత్రం ) జూలై 11 న సంపూర్ణ సూర్యగ్రహణం రానున్నది. సికింద్రాబాద్ మహంకాళి జాతర జూలై 12 ఆదివారం శతభిషా నక్షత్రంలో ( రాహువు స్వనక్షత్రం ) జరుగును. రాహుశనుల షష్టాష్టకం లో వచ్చే మకర మాలికా యోగ ప్రభావం భాగ్యనగరం మీద ప్రభావం చూపుతుందా?.....సికింద్రాబాద్ మహంకాళి జాతర రోజున భవిష్యవాణి వినిపించే మహిళ ఏమి చెబుతుందో?...మూడు గ్రహణాలు ముప్పు అంటూ... మొదలుపెడుతుండా?... లేక..... రాజశేఖరుని కొలువుని కీర్తిస్తుందా?

ఏది ఏమైనా మూడు గ్రహణాలు ముప్పు మాత్రం లేదు... భాగ్యనగరంలో హిందూ ముస్లిం భాయ్..భాయ్.. దోస్తికి భంగం వాటిల్లకూడదని మనసారా కోరుకుందాం............... శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.