Wednesday, June 17, 2009

మకర మాలికా యోగ దుష్ఫలితాలకు మొదటి పరిహారం

2009 జూన్ 15 రాత్రి నుంచి 18 ఉదయం వరకు 55 గంటల పాటు జరిగే అరుదైన మకర మాలికా యోగ కారణంగా పన్నెండు రాశులపై దాని ప్రభావము వుంటుంది. అంతేగాకుండా ఈ యోగ ప్రారంభమైన ముప్పై ఎనిమిది రోజులకే సంపూర్ణ సూర్యగ్రహణము 22 జూలై 2009 న, పదిహేను రోజుల ముందు వెనకాలలో ప్రచ్ఛాయ చంద్ర గ్రహణాలు (మరో పోస్టింగ్ లో ప్రచ్ఛాయ చంద్ర గ్రహణాలు అంటే ఏమిటో తెలుసుకొందాము ) జరుగుతున్నాయి. గనుక ఈ దుష్ఫలితాలు లేకుండా వుండాలంటే దేవీఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ దుష్ఫలితాల ప్రభావము రాహు శని గ్రహాల షష్టాష్టకము వెళ్ళునంతవరకు అనగా 9 సెప్టెంబర్ 2009 వరకుండును. అంతవరకు పన్నెండు రాశుల వారు ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసినచో ఉపశాంతి కలుగును.

నవరంధ్రాలతో కూడిన ఈ దేహము నవచక్రములతో విరాజిల్లే శ్రీచక్రముతో సమన్వయము చేయబడినది భావనోపనిషత్ లో. శ్రీ చక్రములోని మొదటి చక్రమైన త్రైలోక్యమోహన చక్రము భూ తత్వముతో కూడినది. ఈ చక్రములోని రెండవ రేఖలో నాల్గు భుజములు కల్గి పద్మము శూలము ను ధరించి చిత్ర విచిత్రములైన ఆభరణములతో అష్టమాతృకలు వుంటారు. బ్రహ్మ యొక్క శక్తితో బ్రాహ్మీ, ఈశ్వరుని శక్తితో మహేశ్వరి, కుమారస్వామి శక్తితో కౌమారి, విష్ణుమూర్తి శక్తితో వైష్ణవి, వరాహరూపుని శక్తితో వారాహి, ఇంద్రుని శక్తితో మహేంద్రి, చందమున్డులను వధించిన శక్తి చాముండా, లక్ష్మీ సంపన్నంతో మహాలక్ష్మీ అనే అష్టమాతృకలు త్రైలోక్యమోహన చక్రంలో వుంటారు. వీరి ఆభయంతో అష్టరాశులలో ఏర్పడిన ఈ అవయోగ దుష్ఫలితాలు తప్పక తొలగగలవు. గనుక భక్తిప్రపత్తులతో 9 సెప్టెంబర్ 2009 వరకు నిత్యం స్తోత్రించినచో సకల శుభములు కలుగ గలవు.

ఇదిగాక సుందరాకాండ పారాయణం చేసినచో కూడా శుభములు కలుగగలవు. సుందరాకాండలో ఏ ఏ శ్లోకములు పారాయణము చేయవలయనో తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.