Sunday, June 21, 2009

9 వ సం.. 9 వ నెల.. 9 వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల.. 9 సెకన్లకు... ఏమవుతుంది ?

9 వ సం.. 9 వ నెల.. 9వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల... 9 సెకన్లకు... ఏమవుతుంది ప్రపంచంలో. అనే ఆత్రుత అందరిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 6 తొమ్మిది అంకెలను కలపగా 54 మొత్తం వస్తుంది. ఈ రెండు అంకెలను కలిపితే మరల తొమ్మిది సంఖ్య వస్తుంది. తొమ్మిది సంఖ్య కుజగ్రహానికి ప్రతీక. ఇలా ప్రతి సంవత్సరం ఒక అంకె ప్రత్యేకంగా వస్తూనే ఉంటుంది. అలా ప్రత్యేకంగా వచ్చిన రోజును కొంతమంది అదృష్టంగా భావిస్తే, మరికొంత మంది అరిష్టంగా భావిస్తారు. గత 2008 లో ఆగష్టు 8 న బీజింగ్ లో ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. మరి ఈ 2009 లో ప్రత్యేకత ఏమిటి? ఖగోళ ప్రత్యేకత ఏమిటి? శాస్త్ర ప్రత్యేకత ఏమిటి?...

ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే ఒకే అంకె రావటం మామూలే. అయితే ఖగోళంలో శని గ్రహం ఈ రోజే సింహరాశి నుంచి కన్యారాశికి ప్రయాణమై వెళుతుంది. ఈ రోజుతోనే మకర మాలికా యోగ అరిష్టం వెడుతుంది. ఈనాటి నక్షత్రం భరణి. ఈ రోజును భరణీమహాలయం అని పిలుస్తారు. పితృదేవతల కాలమే మహాలయపక్షాలు. దీనినే పితృపక్షంగా చెప్తారు. భరణీ నక్షత్రానికి యముడు అధిపతి. ఖచ్చితంగా పైన తెల్పిన ఆరు తొమ్ముదులు తులా లగ్నంలో వుంటాయి. తుల లగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర నక్షత్రమే భరణీ. ఈ భరణీ నక్షత్రముండేది మేషరాశిలో. ఈ మేషరాశి అధిపతి కుజుడు. విచిత్రమేమంటే పై ఆరు తొమ్మిది సంఖ్యలు తులా లగ్నంలో వస్తుంటే, తొమ్మిది సంఖ్యకు అధిపతైన కుజుడు తులా లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలోనే వున్నాడు. తమాషాగా ఉంది కదూ!

ఇలా కబుర్లు చెప్తూపోతే కొండవీటి చేంతాడంత అవుతుంది. ఇదంతా మనకి అనవసరం. కాకతాళీయంగా ఈనాడు భరణీ మహాలయం వచ్చింది. శని కన్యా రాశికి వస్తున్నాడు. మకర మాలికా యోగ దుష్ఫలితాలు పోతున్నాయి. వృషభ, మకర, కర్కాటక రాశులవారు ఎంతో సంతోషంతో వుండాలి. ఎందుకో తెలుసా? శని వేదనల నుంచి విముక్తి. మరి మిధున, కుంభ, తులారాశులవారు శని వేదనలోకి వెడతారు. కనుక ఈ భరణీమహాలయం రోజున పితృదేవతలని స్మరించండి. శుభాలు జరగాలని కోరుకోండి. తెల్లవారితే తొమ్మిది పోతుంది. తమాషాగా బాగుంది కదూ! ....
...............................శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.