Sunday, September 27, 2015

భారతంలో చంద్ర గ్రహణం లేదు, అరిష్టానికి పరిహారం

భారత కాలమాన ప్రకారం 28 సెప్టెంబర్ 2015 సోమవారం ఉదయం 6 గంటల 37 నిముషాలకు ఖగోళంలో మీనరాశిలో చంద్రునికి గ్రహణం ప్రారంభమగును. ఉదయం 7గంటల 41 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థాయి లోనికి చంద్రుడు వెళ్ళును. 72 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము నిలబడును. ఉదయం 8 గంటల 53 నిముషాలకు సంపూర్ణ గ్రహణము నుంచి విడుపు ప్రారంభమగును. ఉదయం 9 గంటల 57 నిముషాలకు చంద్ర గ్రహణం ముగియును. ఈ సమయములు భారత దేశములో పగటి యందు ఉన్నందున చంద్ర గ్రహణము భారతదేశములో కనపడదు.

ఇతర దేశాలలోనే కనపడును. 106 రోజుల అరిష్ట గ్రహ సంచారాలలో ఈ గ్రహణము కూడా ఉన్నది. దీని ప్రభావము, భూకంపాలపైననూ, జల సంబందిత సముద్ర అలలపైననూ, ద్వాదశ రాశులపైననూ ఉండును. అయితే ద్వాదశ రాశుల వారు ఆచరించవలసిన పరిహారములలొ భాగంగా 10 ముద్రలతో మంగళ, గురు, ఆదివారాలలో గ్రహణం తదుపరి నుంచి పరిహారాలు పాటిస్తే అనుకూలతలు ఉండును.

కనుక పఠించవలసిన శ్లోకాన్ని దిగువ ఇమేజ్ లో ఇవ్వబడినది. జగన్మాతను ప్రార్ధించుకుంటూ శ్లోకాలను ముద్రలు వేస్తూ పఠించేది. గత పోస్టింగ్ లలో ముద్రల వివరాలు ఇవ్వటం జరిగింది. కనుక ఆచరించేది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.