Sunday, September 13, 2015

ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు

2015 సెప్టెంబర్ లో వచ్చే భాద్రపదమాస పూర్ణిమకు కనపడే పెద్ద జాబిలి చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ...
అదే రోజున 72  నిముషాల పాటు కనపడే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 106 రోజుల గ్రహ స్థితిలో ప్రధాన కేంద్ర బిందువు కానున్నది.

ఇక భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ 15 మంగళవారం రాత్రి 9.29 ని.ల నుంచి కుజ గ్రహము సింహరాశి ప్రవేశం జరుగును. కుజుడు సింహరాశి ప్రవేశంతో సమస్యలకు మూలాధారమవుతాడు.

మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్న గణపతి యొక్క జన్మదినం రోజే ప్రకృతి రాశిలోనికి సూర్య ప్రవేశం జరగటం, ఆపైన ఇటు సింహరాశిలో మూడు గ్రహాల కలయిక, తదుపరి నవంబర్ 3 నుంచి కన్యారాశిలో రాహువుతో కుజుడు, నీచ శుక్రుడు కలయిక జరుగును.

సింహ, కన్యా రాశులలో కుజ గ్రహ సంచారంతో త్రిగ్రహ కూటములు జరగనున్నవి. వీటి ప్రభావం ప్రకృతి రీత్యానే కాక వివిధ రాష్ట్రాల దేశ రాజకీయ స్థితి గతులమీద, క్రీడా, వాణిజ్య, సంగీత, సినీ, న్యాయ, మరియు మరికొన్ని ఇతర రంగాలపైననే కాక.. ద్వాదశ రాశుల వారి వ్యక్తిగత, మానసిక, ఆర్ధిక, శారీరక, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వైవాహిక, సంతాన సంబంధిత అంశాలన్నిటిపై పరి పరి విధాలుగా వ్యతిరేక ఫలితాలు రాగల సూచనలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనసును అదుపు చేసుకుంటూ... ఈ 106 రోజులలో ఏర్పడే అరిష్ట గ్రహస్థితికి చెప్పే పరిహారాలను పాటిస్తూ ఉంటే కొంత ఉపశాంతి మార్గం తప్పక కల్గును.

భారతదేశంలో చంద్రగ్రహణం కనపడకపోయినప్పటికీ దీర్ఘ కాల గ్రహణ బింబ ప్రభావము ప్రపంచ వ్యాప్తంగా ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహ స్థితులకు తోడుగా ఉండును. కనుక మేషరాశి నుంచి మీన రాశి వరకు గల 12 రాశుల వారికి ఏయే అంశాలలో వ్యతిరేకతలు వస్తాయో నా ఫేస్ బుక్ పేజి లింక్ ను  క్లిక్ చేసి తెలుసుకొనగలరు. 


https://www.facebook.com/Sreenivasa-Gargeya-Ponnaluri-293928097457427/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.