ఆషాడం వచ్చిందంటే చాలు...... తెలంగాణా ప్రాంతంలో ప్రతి ఇంతా బోనాల హడావిడి కనిపిస్తుంది. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతి ఆషాడంలోను అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ బోనాల పండుగ ఉత్సవాలు ఈనాటివి కావు. ఆషాఢమాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే ఈ బోనాల పండుగ ఉత్సవాలు .......చివరి ఆదివారం వరకు.... నిత్యం ప్రత్యేకమైన పూజలతో జరుగుతాయి.
ప్రతి గురు, ఆదివారాలలో భారీ సంఖ్యలో భోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. మూడో ఆదివారం జూలై 12 న సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం లో అమ్మవారికి లష్కర్ బోనాలు సమర్పిస్తారు. తరువాత వచ్చే.. చివరి ఆదివారం నాడు పాతనగరం లోని లాల్ దర్వాజా మాతా సింహవాహిని ఆలయంలో సంబరాలు నిర్వహిస్తారు..... ఇదే రోజున జంట నగరాలలోని 116 ఆలయాలలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.
బోనాలు అంటే ఏమిటి?
భక్తులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలను సామూహికంగా సమర్పించే ఈ అపురూపమైన దృశ్యాలు చూడ చక్కగా వుంటాయి. పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఆరే మైసమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ తదితర పేర్లతో కొలువైవున్న ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు వారి సోదరుడైన పోతురాజు తోడుగా రాగా లక్షలాది భక్తులు ప్రతి ఆషాఢ మాసం లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని చల్లగా చూడమని మొక్కుతారు. ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారు చేసే నైవేద్యమే బోనాలు. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో వుంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలు అంటారు.
ఇక అసలు ముఖ్యమైనది భవిష్యవాణి...
బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పటం. రంగం చెప్పటమంటే భవిష్యవాణిని వినిపించటమే. రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? నగరంలో ప్రజల స్థితిగతులు ఎలా వుండబోతున్నాయి ... మొదలైన వివరాలను చెప్పడమన్నమాట. ఇలా చెప్పేది ఒక మహిళ. ఒక కుటుంబానికి చెందినా అవివాహిత మాత్రమే.... తరతరాలుగా ఇలా రంగం చెప్పటం సంప్రదాయంగా వస్తోంది.. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభోగంగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. గర్భగుడి లోని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంశను... తనలో ఇముడ్చుకుందా అన్నట్లుగా...... పచ్చి కుండపై పాదం మోపి భక్తి పారవశ్యంతో ఊగిపోతూ.... భవిష్యత్తును..... వివరిస్తుందా మహిళ.
సికింద్రాబాద్ మహంకాళి జాతరకు 11 వ రోజునే సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది. ఈ గ్రహణానికి 3 రోజుల ముందుగా వచ్చే ఆదివారం అనగా 19 జూలై తో బోనాల పండుగ ముగియనుంది.... శ్రీ విరోధి నామ సంవత్సరంలో బోనాల పండుగ జూన్ 25 గురువారం పుష్యమి నక్షత్రం ( శని స్వనక్షత్రం ) రోజున ప్రారంభమయ్యాయి. అదే రోజున ముస్లిం సోదరుల రజ్జబ్ నెల కూడా ప్రారంభమైంది. ఇదే పుష్యమిలో ( శని స్వనక్షత్రం ) జూలై 11 న సంపూర్ణ సూర్యగ్రహణం రానున్నది. సికింద్రాబాద్ మహంకాళి జాతర జూలై 12 ఆదివారం శతభిషా నక్షత్రంలో ( రాహువు స్వనక్షత్రం ) జరుగును. రాహుశనుల షష్టాష్టకం లో వచ్చే మకర మాలికా యోగ ప్రభావం భాగ్యనగరం మీద ప్రభావం చూపుతుందా?.....సికింద్రాబాద్ మహంకాళి జాతర రోజున భవిష్యవాణి వినిపించే మహిళ ఏమి చెబుతుందో?...మూడు గ్రహణాలు ముప్పు అంటూ... మొదలుపెడుతుండా?... లేక..... రాజశేఖరుని కొలువుని కీర్తిస్తుందా?
ఏది ఏమైనా మూడు గ్రహణాలు ముప్పు మాత్రం లేదు... భాగ్యనగరంలో హిందూ ముస్లిం భాయ్..భాయ్.. దోస్తికి భంగం వాటిల్లకూడదని మనసారా కోరుకుందాం............... శ్రీనివాస గార్గేయ
Saturday, June 27, 2009
Friday, June 26, 2009
Thursday, June 25, 2009
వరుణ యాగం ముహూర్తం సరైనదేనా ?
జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి ఊరించిన ఋతుపవనాలు చివరకు నిరాశ మిగిల్చాయి. ఈ యేడాది దేశం మొత్తం మీద నైరుతి ఋతుపవనాల ప్రభావము సాధారణము కంటే తక్కువే వుంటుందని కేంద్ర భూశాస్త్ర విభాగ మంత్రి పృధ్వీ రాజ్ ఢిల్లీలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో కనీస వర్షపాతమైనా నమోదు కావాలి. ప్రస్తుతం నేల తదిసేవరకు కూడా పడటం లేదు. పూర్తిగా రాష్ట్రం అంతా వర్షాభావం అలుముకుంది. భారత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానేవుంది. ఇప్పటికే మాంద్యంతో కృంగి పోయిన ఆర్ధికవ్యవస్థకు వర్షాభావ హెచ్చరిక శరాఘాతం కానుంది.
పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వుండటానికి వరుణయాగాలు, ప్రార్ధనలు చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపాలని ప్రభుత్వం వారు.... అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పెద్ద, 1819 చిన్న ఆలయాలలో కలిసి మొత్తం 1938 దేవాలయాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవదాయ, ధర్మదాయ ( దేవాదాయ, ధర్మాదాయ కాదు ) శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలిపారు.
ఈ నేపధ్యం లో తిరుమలలో వరుణ జపాలు, ప్రత్యక పూజలు నిర్వహించనున్నట్లు టి.టి.డి. చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. గత యేడాది దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి వరుణ యాగం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 108 హోమగుండాలతో జూలై 2 నుంచి 4 వరకు వరుణయాగం చేయనున్నారు టి.టి.డి. వారు.
అయితే మేము తెలియచేసే వివరాలు ఏమిటంటే గతంలోనూ, ఎన్నోసార్లు వరుణయాగాలు చేసి విజయం సాధించని దాఖలాలు వున్నవి. దీనివలన యాగాల కొరకు సొమ్మును వృధా చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నవి.వరుణయాగం చేయాలనుకున్నప్పుడు కేవలం సేవాభావంతో, భక్తి తత్పరతతో, విశ్వాసంతో సరైన నక్షత్ర బలంతో పునాది వేస్తే, ఆ భక్తిచే భగవంతునితో బంధం ఏర్పడుతుంది. గనుక ప్రాధమిక విషయాలు గుర్తించకుండా, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి.... ఫలితాలు రాకపోతే, ఇతరులచే నిందింపబడేదానికన్నా........ ముందుగా జ్యోతిష్య పండితులలో సిద్ధహస్తులైన వారితోనే ప్రభుత్వ అధికారులు చర్చలు జరపాలి........ఏమి చర్చలు ?..... దేని కోసం?
నాచే రచింపబడిన శ్రీ విరోధి సంవత్సర " గ్రహభుమి " పంచాంగం ( పేజీ నెంబర్ 31 ).... " కాలచక్రం " పంచాంగం ( పేజీ నెంబర్ 40 ) లలో ఆఢక మేఘ వాయి నిర్ణయాలు అనే శీర్షికలో జూన్ ఆఖరి నాటి పరిస్థితి తెలియజేస్తూ "త్రాగునీటికి తీవ్ర ఎద్దడి యేర్పడును. ఋతుపవనాలకై వేచి వుందురు." జూలై 4 వ తేది తరువాత వాతావరణము ఆంద్రప్రదేశ్ లో కొన్నిచోట్ల చల్లబడును. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినప్పటికీ ఫలితం తక్కువ" అని వ్రాసాను.
నా పంచాంగం లో జూలై 4 తరువాత వాతావరణం చల్లబడును అని వుంది గనుక, 4 వ తేదీతో వరుణయాగం ముగిస్తే.... విజయం పొందామని ఊహించవచ్చు.......... కాని ఫలితం తక్కువేనని నేనంటున్నాను. ఎందుకంటే.... వరుణయాగం చేసే సమయంలో ముఖ్యంగా చంద్రుడు జల సంబంధ రాశులలో వుంది తీరాలి అప్పుడే యాగం విజయవంతమవుతుంది. అనగా చంద్రుడు కర్కాటక, మీన , మకర, రాశులలో వుండి ఇతర గ్రహ సంచారం అనుకూలంగా వుండాలి. అలాంటప్పుడు జూలై 8,9,10 తేదీలలో వరుణయాగ సంబంధిత వేదమంత్రాలు, వరుణప్రియ, అమృతవర్షిణి రాగాలతో సంగీత ఝరి ఏర్పాటు చేస్తే తప్పక వరుణ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు.
కాబట్టి టి.టి.డి వారు జూలై 2,3,4 తేదీలు కాకుండా జూలై 8,9,10 తేదీలలో వరుణయాగం ఏర్పాటు చేస్తే, చంద్రుడు మకర రాశిలో వున్నందున పూర్ణ ఫలితం లభిస్తుంది. చెప్పేటంతవరకే నా కృషి..... వినని వారిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.................. శ్రీనివాస గార్గేయ
ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో కనీస వర్షపాతమైనా నమోదు కావాలి. ప్రస్తుతం నేల తదిసేవరకు కూడా పడటం లేదు. పూర్తిగా రాష్ట్రం అంతా వర్షాభావం అలుముకుంది. భారత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానేవుంది. ఇప్పటికే మాంద్యంతో కృంగి పోయిన ఆర్ధికవ్యవస్థకు వర్షాభావ హెచ్చరిక శరాఘాతం కానుంది.
పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వుండటానికి వరుణయాగాలు, ప్రార్ధనలు చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపాలని ప్రభుత్వం వారు.... అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పెద్ద, 1819 చిన్న ఆలయాలలో కలిసి మొత్తం 1938 దేవాలయాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవదాయ, ధర్మదాయ ( దేవాదాయ, ధర్మాదాయ కాదు ) శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలిపారు.
ఈ నేపధ్యం లో తిరుమలలో వరుణ జపాలు, ప్రత్యక పూజలు నిర్వహించనున్నట్లు టి.టి.డి. చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. గత యేడాది దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి వరుణ యాగం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 108 హోమగుండాలతో జూలై 2 నుంచి 4 వరకు వరుణయాగం చేయనున్నారు టి.టి.డి. వారు.
అయితే మేము తెలియచేసే వివరాలు ఏమిటంటే గతంలోనూ, ఎన్నోసార్లు వరుణయాగాలు చేసి విజయం సాధించని దాఖలాలు వున్నవి. దీనివలన యాగాల కొరకు సొమ్మును వృధా చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నవి.వరుణయాగం చేయాలనుకున్నప్పుడు కేవలం సేవాభావంతో, భక్తి తత్పరతతో, విశ్వాసంతో సరైన నక్షత్ర బలంతో పునాది వేస్తే, ఆ భక్తిచే భగవంతునితో బంధం ఏర్పడుతుంది. గనుక ప్రాధమిక విషయాలు గుర్తించకుండా, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి.... ఫలితాలు రాకపోతే, ఇతరులచే నిందింపబడేదానికన్నా........ ముందుగా జ్యోతిష్య పండితులలో సిద్ధహస్తులైన వారితోనే ప్రభుత్వ అధికారులు చర్చలు జరపాలి........ఏమి చర్చలు ?..... దేని కోసం?
నాచే రచింపబడిన శ్రీ విరోధి సంవత్సర " గ్రహభుమి " పంచాంగం ( పేజీ నెంబర్ 31 ).... " కాలచక్రం " పంచాంగం ( పేజీ నెంబర్ 40 ) లలో ఆఢక మేఘ వాయి నిర్ణయాలు అనే శీర్షికలో జూన్ ఆఖరి నాటి పరిస్థితి తెలియజేస్తూ "త్రాగునీటికి తీవ్ర ఎద్దడి యేర్పడును. ఋతుపవనాలకై వేచి వుందురు." జూలై 4 వ తేది తరువాత వాతావరణము ఆంద్రప్రదేశ్ లో కొన్నిచోట్ల చల్లబడును. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినప్పటికీ ఫలితం తక్కువ" అని వ్రాసాను.
నా పంచాంగం లో జూలై 4 తరువాత వాతావరణం చల్లబడును అని వుంది గనుక, 4 వ తేదీతో వరుణయాగం ముగిస్తే.... విజయం పొందామని ఊహించవచ్చు.......... కాని ఫలితం తక్కువేనని నేనంటున్నాను. ఎందుకంటే.... వరుణయాగం చేసే సమయంలో ముఖ్యంగా చంద్రుడు జల సంబంధ రాశులలో వుంది తీరాలి అప్పుడే యాగం విజయవంతమవుతుంది. అనగా చంద్రుడు కర్కాటక, మీన , మకర, రాశులలో వుండి ఇతర గ్రహ సంచారం అనుకూలంగా వుండాలి. అలాంటప్పుడు జూలై 8,9,10 తేదీలలో వరుణయాగ సంబంధిత వేదమంత్రాలు, వరుణప్రియ, అమృతవర్షిణి రాగాలతో సంగీత ఝరి ఏర్పాటు చేస్తే తప్పక వరుణ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు.
కాబట్టి టి.టి.డి వారు జూలై 2,3,4 తేదీలు కాకుండా జూలై 8,9,10 తేదీలలో వరుణయాగం ఏర్పాటు చేస్తే, చంద్రుడు మకర రాశిలో వున్నందున పూర్ణ ఫలితం లభిస్తుంది. చెప్పేటంతవరకే నా కృషి..... వినని వారిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.................. శ్రీనివాస గార్గేయ
Wednesday, June 24, 2009
వరుసగా 3 గ్రహణాలు రావటం మహా ప్రళయానికి కారణమా?
2 చంద్ర గ్రహణముల మధ్య ఓ సూర్యగ్రహణము లేదా 2 సూర్య గ్రహణముల మధ్య ఓ చంద్ర గ్రహణము వరుసగా రావటం అరుదైన విషయం కాదు. తరచుగా వస్తుంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవటంచే........ నిన్న - ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు టి.వి. ఛానళ్ళు ఊకదంపుడుగా ప్రసారం చేయటానికి వెనుక వున్న విషయం ఏమిటంటే... ఓ అవగాహన లేని వ్యక్తి ప్రపంచ ప్రళయాన్ని గురించి పుస్తకం రాయటం.
2 చంద్ర గ్రహణముల మధ్య ఓ సూర్యగ్రహణము లేదా 2 సూర్య గ్రహణముల మధ్య ఓ చంద్ర గ్రహణము వరుసగా రావటం అరుదైన విషయం కాదు. తరచుగా వస్తుంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవటంచే........ నిన్న - ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు టి.వి. ఛానళ్ళు ఊకదంపుడుగా ప్రసారం చేయటానికి వెనుక వున్న విషయం ఏమిటంటే... ఓ అవగాహన లేని వ్యక్తి ప్రపంచ ప్రళయాన్ని గురించి పుస్తకం రాయటం.
అసలు ఈ ప్రళయం నిజమేనా?....అనే విషయంపై ఒక జ్యోతిష్య పండితుడిగా మీకు ఎన్నో విషయాలు చెప్పాల్సి వుంది. వరుసగా మూడు గ్రహణాలు రావటం అరుదు కానేకాదు. తరచుగా వస్తుంటాయి. రెండు సూర్య గ్రహణాల మధ్య ఓ చంద్ర గ్రహణము, రెండు చంద్ర గ్రహణాల మధ్య ఓ సూర్య గ్రహణము లాంటివి ఒక శతాబ్దానికి దాదాపు 28 వరకు వస్తుంటాయి. గత 60 సంవత్సరాల నుంచి చూసినచో ఇప్పటి వరకు 15 సార్లు వరుస గ్రహణాలు వచ్చాయి.
1951 ఆగష్టు 17 చంద్ర......... సెప్టెంబర్ 01 సూర్య........సెప్టెంబర్ 15 చంద్ర గ్రహణములు
1953 జూలై 11 సూర్య...........జూలై 26 చంద్ర...............ఆగష్టు 09 సూర్య గ్రహణములు
1958 ఏప్రిల్ 04 చంద్ర...........ఏప్రిల్ 19 సూర్య............ మే 03చంద్ర గ్రహణములు
1962జూలై 17 చంద్ర............ జూలై 31 సూర్య...............ఆగష్టు 15 చంద్ర గ్రహణములు
1964 జూన్ 10 సూర్య...........జూన్ 25 చంద్ర.................జూలై 09 సూర్య గ్రహణములు
1969 ఆగష్టు 27 చంద్ర..........సెప్టెంబర్ 11 సూర్య.........సెప్టెంబర్ 25 చంద్ర గ్రహణములు
1971జూలై 22 సూర్య........... ఆగష్టు 06 చంద్ర.............ఆగష్టు 21 సూర్య గ్రహణములు
1973 జూన్ 15 చంద్ర.............జూన్ 30 సూర్య..............జూలై 15 చంద్ర గ్రహణములు
1980జూలై 27 చంద్ర.............ఆగష్టు10సూర్య.............ఆగష్టు 26 చంద్ర గ్రహణములు
ఈ ప్రకారంగా వరుస గ్రహణాలు ఇంకా ఇంకా వచ్చాయి. పై వాటిలో సంపూర్ణ గ్రహణాలు, పాక్షిక గ్రహణాలు, ప్రచ్చాయ గ్రహణాలు కలిసి వున్నాయి. 36 సంవత్సరాల క్రితం 1973 లో జూన్ 30వ తేదీ సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చి ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు వచ్చినట్టు ఈ 2009 లో కూడా జూలై 22 న సంపూర్ణ సూర్య గ్రహణము ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు రాబోతున్నాయి.
అవగాహనలేని పండితుడు చెప్పిన విధంగా వరుస గ్రహణాలు వస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా! మరి ఒక శతాబ్దానికి 28 సార్లు వరుస గ్రహణాలు వస్తే, అన్నిసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చాయా? ఏ మాత్రం అవగాహన లేని వారు ఏదో చెప్పినంత మాత్రాన....దానిని మీడియా వారు పెద్దది చేసి చూపిస్తే..... మనో దౌర్భల్యం కల వారు చూస్తే వారి గతి ఏమవుతుంది. విజ్ఞులు ఆలోచించాలి. అవగాహన లేని వారి వలన జ్యోతిశాశ్ర్తమే అవహేలనకు గురై, హేతువాదుల దృష్టి లో మాయని మచ్చతో బ్రష్టుపట్టి పోతున్నది శాస్త్రం.
ఇంతకీ అసలు విషయానికి వద్దాం...... సంపూర్ణ సూర్య గ్రహణం జరుగుతున్నదా? నిజమే జరుగుతుంది. వరుసగా మూడు గ్రహణాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అయితే ఏమిటి? ఎవరికి సమస్య? అనే కోణం లోనే ఆలోచించాలి. వరుస మూడు గ్రహణాలు రావటం వలన ప్రమాదమేమి లేదు. ముప్పు అంతకంటే లేదు కేవలం మకర మాలికా యోగ దేశారిష్టం తో సంపూర్ణ సూర్య గ్రహణం కలసి రావటం 400 సంవత్సరాల తరువాత వస్తున్నది. దీని వలన ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదు........ ఇది కేవలం దేశారిష్టమే. దేశం నిత్యం అరిష్టాలతోనే సాగుతున్నది. ఒకవైపు ఉగ్రవాద మరోవైపు ఏర్పాటువాదం. వీరి దుష్కార్యాలు మరికొంత పెరగటానికి అవకాశం ప్రస్తుతం వుంటుంది. కొన్ని చోట్ల భూకంపాలు రాగల సూచన వుంది అంతేతప్ప మహా ప్రళయాలు కాదు . లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి చోట్ల జరిగిన బాంబ్ దాడులలో అమాయకులు బలైపోతున్నారు. ఇలాంటి దుష్కార్యాలు అంతం కావాలి. దానికి ప్రభుత్వాలు నడుం కట్టాలి. వ్యక్తుల వలన తీరే పని కాదు.
కనుక ఇలాంటి దేశారిష్ట యోగాల వలన మనకు మనం పరిహారాల ద్వారా రక్షించుకొనాలి. గనుక పాఠకులకు తెలియచేయినదేమనగా వరుసగా ముప్పై రోజులలో వచ్చే మూడు గ్రహణాల వలన ప్రపంచం తలక్రిందులు కాదు. యుద్ధాలు రానే రావు. ప్రళయాలు అంతకంటే రావు. మనో దౌర్భల్యం తో ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకొని భాదపడేదాని కన్నా సత్యాన్ని గ్రహించి భగవంతుడిని ధ్యానిస్తే తప్పక శుభకర ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పే ఈ నిజాన్ని నమ్మి మీ స్నేహితులకి తెలియచేప్పండి. అవగాహన లేని ఆకతాయిలు చెప్పే అసత్యాలను త్రిప్పి కొట్టండి............. శ్రీనివాస గార్గేయ
2 చంద్ర గ్రహణముల మధ్య ఓ సూర్యగ్రహణము లేదా 2 సూర్య గ్రహణముల మధ్య ఓ చంద్ర గ్రహణము వరుసగా రావటం అరుదైన విషయం కాదు. తరచుగా వస్తుంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవటంచే........ నిన్న - ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు టి.వి. ఛానళ్ళు ఊకదంపుడుగా ప్రసారం చేయటానికి వెనుక వున్న విషయం ఏమిటంటే... ఓ అవగాహన లేని వ్యక్తి ప్రపంచ ప్రళయాన్ని గురించి పుస్తకం రాయటం.
అసలు ఈ ప్రళయం నిజమేనా?....అనే విషయంపై ఒక జ్యోతిష్య పండితుడిగా మీకు ఎన్నో విషయాలు చెప్పాల్సి వుంది. వరుసగా మూడు గ్రహణాలు రావటం అరుదు కానేకాదు. తరచుగా వస్తుంటాయి. రెండు సూర్య గ్రహణాల మధ్య ఓ చంద్ర గ్రహణము, రెండు చంద్ర గ్రహణాల మధ్య ఓ సూర్య గ్రహణము లాంటివి ఒక శతాబ్దానికి దాదాపు 28 వరకు వస్తుంటాయి. గత 60 సంవత్సరాల నుంచి చూసినచో ఇప్పటి వరకు 15 సార్లు వరుస గ్రహణాలు వచ్చాయి.
1951 ఆగష్టు 17 చంద్ర......... సెప్టెంబర్ 01 సూర్య........సెప్టెంబర్ 15 చంద్ర గ్రహణములు
1953 జూలై 11 సూర్య...........జూలై 26 చంద్ర...............ఆగష్టు 09 సూర్య గ్రహణములు
1958 ఏప్రిల్ 04 చంద్ర...........ఏప్రిల్ 19 సూర్య............ మే 03చంద్ర గ్రహణములు
1962జూలై 17 చంద్ర............ జూలై 31 సూర్య...............ఆగష్టు 15 చంద్ర గ్రహణములు
1964 జూన్ 10 సూర్య...........జూన్ 25 చంద్ర.................జూలై 09 సూర్య గ్రహణములు
1969 ఆగష్టు 27 చంద్ర..........సెప్టెంబర్ 11 సూర్య.........సెప్టెంబర్ 25 చంద్ర గ్రహణములు
1971జూలై 22 సూర్య........... ఆగష్టు 06 చంద్ర.............ఆగష్టు 21 సూర్య గ్రహణములు
1973 జూన్ 15 చంద్ర.............జూన్ 30 సూర్య..............జూలై 15 చంద్ర గ్రహణములు
1980జూలై 27 చంద్ర.............ఆగష్టు10సూర్య.............ఆగష్టు 26 చంద్ర గ్రహణములు
ఈ ప్రకారంగా వరుస గ్రహణాలు ఇంకా ఇంకా వచ్చాయి. పై వాటిలో సంపూర్ణ గ్రహణాలు, పాక్షిక గ్రహణాలు, ప్రచ్చాయ గ్రహణాలు కలిసి వున్నాయి. 36 సంవత్సరాల క్రితం 1973 లో జూన్ 30వ తేదీ సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చి ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు వచ్చినట్టు ఈ 2009 లో కూడా జూలై 22 న సంపూర్ణ సూర్య గ్రహణము ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు రాబోతున్నాయి.
అవగాహనలేని పండితుడు చెప్పిన విధంగా వరుస గ్రహణాలు వస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా! మరి ఒక శతాబ్దానికి 28 సార్లు వరుస గ్రహణాలు వస్తే, అన్నిసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చాయా? ఏ మాత్రం అవగాహన లేని వారు ఏదో చెప్పినంత మాత్రాన....దానిని మీడియా వారు పెద్దది చేసి చూపిస్తే..... మనో దౌర్భల్యం కల వారు చూస్తే వారి గతి ఏమవుతుంది. విజ్ఞులు ఆలోచించాలి. అవగాహన లేని వారి వలన జ్యోతిశాశ్ర్తమే అవహేలనకు గురై, హేతువాదుల దృష్టి లో మాయని మచ్చతో బ్రష్టుపట్టి పోతున్నది శాస్త్రం.
ఇంతకీ అసలు విషయానికి వద్దాం...... సంపూర్ణ సూర్య గ్రహణం జరుగుతున్నదా? నిజమే జరుగుతుంది. వరుసగా మూడు గ్రహణాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అయితే ఏమిటి? ఎవరికి సమస్య? అనే కోణం లోనే ఆలోచించాలి. వరుస మూడు గ్రహణాలు రావటం వలన ప్రమాదమేమి లేదు. ముప్పు అంతకంటే లేదు కేవలం మకర మాలికా యోగ దేశారిష్టం తో సంపూర్ణ సూర్య గ్రహణం కలసి రావటం 400 సంవత్సరాల తరువాత వస్తున్నది. దీని వలన ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదు........ ఇది కేవలం దేశారిష్టమే. దేశం నిత్యం అరిష్టాలతోనే సాగుతున్నది. ఒకవైపు ఉగ్రవాద మరోవైపు ఏర్పాటువాదం. వీరి దుష్కార్యాలు మరికొంత పెరగటానికి అవకాశం ప్రస్తుతం వుంటుంది. కొన్ని చోట్ల భూకంపాలు రాగల సూచన వుంది అంతేతప్ప మహా ప్రళయాలు కాదు . లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి చోట్ల జరిగిన బాంబ్ దాడులలో అమాయకులు బలైపోతున్నారు. ఇలాంటి దుష్కార్యాలు అంతం కావాలి. దానికి ప్రభుత్వాలు నడుం కట్టాలి. వ్యక్తుల వలన తీరే పని కాదు.
కనుక ఇలాంటి దేశారిష్ట యోగాల వలన మనకు మనం పరిహారాల ద్వారా రక్షించుకొనాలి. గనుక పాఠకులకు తెలియచేయినదేమనగా వరుసగా ముప్పై రోజులలో వచ్చే మూడు గ్రహణాల వలన ప్రపంచం తలక్రిందులు కాదు. యుద్ధాలు రానే రావు. ప్రళయాలు అంతకంటే రావు. మనో దౌర్భల్యం తో ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకొని భాదపడేదాని కన్నా సత్యాన్ని గ్రహించి భగవంతుడిని ధ్యానిస్తే తప్పక శుభకర ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పే ఈ నిజాన్ని నమ్మి మీ స్నేహితులకి తెలియచేప్పండి. అవగాహన లేని ఆకతాయిలు చెప్పే అసత్యాలను త్రిప్పి కొట్టండి............. శ్రీనివాస గార్గేయ
Tuesday, June 23, 2009
నేడే ఆషాఢం ప్రారంభం - పండుగలు ముఖ్యదినాలు
- జూన్ 24 ఆషాఢమాస చంద్రోదయము, పూరి జగన్నాధుని రధయాత్ర
- 25 పితృతిధి ( శ్రాద్ధతిధి ) ద్వయము తదియ, చవితి
- 26 పితృతిధి పంచమి
- 27 స్కంద పంచమి, కుమార షష్టి, పితృతిధి షష్టి
- 28 వివస్వతసప్తమి
- జూలై 1 దధివ్రతారంభం
- 2 హరిశయనేకాదశి ( తొలి )
- 3 పితృతిధి ద్వాదశి
- 4 స్వామి వివేకానంద వర్ధంతి, పితృతిధి త్రయోదశి
- 5 పితృతిధి చతుర్దశి
- 6 పితృతిధి పూర్ణిమ
- 7 మహాషాడి, వ్యాస పూర్ణిమ, కోకిలావ్రతం, శివశయనోత్సవం, ప్రచ్చాయలో చంద్రగ్రహణం ( చంద్రుడు కాంతి విహీనమవును, నల్లగా కాడు )
- 11 సంకష్టహరచతుర్ది
- 12 సికింద్రాబాద్ లో మహంకాళి జాతర
- 16 కర్కాటక సంక్రమణం మ. 03.11 నిమిషాలు ( కర్కాటక సంక్రాంతి )
- 18 కామికా ఏకాదశి
- 20 మాస శివరాత్రి, పితృతిధి ద్వయం ఏకాదశి, ద్వాదశి
- 21 పితృతిధి అమావాస్య
- 22 సంపూర్ణ సూర్యగ్రహణం, సింహాయనం, ఆషాఢ అమావాస్య
Subscribe to:
Posts (Atom)