
Saturday, August 22, 2009
Friday, July 24, 2009
ఈ శతాబ్ది రెండవ శుక్రగ్రహణం 2012 లో.. 2012 వివరాలపై సీ..రియల్ పోస్టింగ్స్ - 1

శుక్ర గ్రహణ మేమిటని .... అనుకుంటున్నారా?... అవును. నిజమే గ్రహణాలు సూర్య చంద్రులకే కాదు. మిగిలిన గ్రహాలకు కూడా అరుదుగా వస్తుంటాయి. రాహువు లేక కేతువుతో కలిసిన ఓ సరళరేఖపైకి భూమి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సాధారణంగా సూర్య గ్రహణం జరుగుతుంది. అలాగాకా సూర్యునికి భూమికి మధ్య చంద్రుడి బదులు శుక్రుడు వచ్చినచో.... శుక్ర గ్రహణం ఏర్పడి...శుక్ర గ్రహం ఒక గుండుసూది ఆకృతిలో సూర్యుని బింబముపై నల్లని చుక్కలా గోచరమవుతుంది.
ఈ శతాబ్దిలో తారణ నామ సంవత్సరంలో జైష్ట బహుళ షష్టి మంగళవారం ది 8 జూన్ 2004 దిన శుక్ర గ్రహణం ఏర్పడి శతాబ్ది తొలి శుక్ర గ్రహణం సూర్యబింబంపై కనువిందు చేసినది. ఈ వైనము మా తారణ సంవత్సర 6 వ పేజీలో పేర్కొన్నాము. ఇలాగే రాబోవు నందన నామ సంవత్సర జ్యేష్ట బహుళ విదియ బుధవారము పూర్వాషాడ నక్షత్ర దినము ది 6 జూన్ 2012 దిన, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో కేతు గ్రస్తంగా శతాబ్ది రెండవ శుక్ర గ్రహణం సంభవించనుంది. గత తారణ సంవత్సరంలో ( 2004 - 05 ) వచ్చిన శుక్ర గ్రహణం ప్రారంభం నుంచి అంత్యం వరకు భారతదేశంలో గోచరమైనది.
ఈ 2012 లో వచ్చే శుక్ర గ్రహణం ప్రారంభ సమయం భారతదేశంలో రాత్రి భాగమైనందున గ్రహణ స్పర్శను భారతదేశంలో చూడలేకపోతున్నాము. గ్రహణ మధ్య కాలమునకు ఒక గంట ముందు నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సూర్యోదయాలు అయినందున..... మనమందరమూ అతి స్పష్టంగా మసి పూసిన అద్దముతో కానీ, ఫిలింతో కానీ, సోలార్ ఫిల్టరు తో కానీ.... సూర్యబింబంపై కదిలి వెళ్ళే గుండుసూది మొన ఆకృతి గల శుక్ర గ్రహాన్ని నల్లని చాయలో దర్శించుకొనవచ్చును. సూర్య బింబము ఒకవైపు వెలుపలి అంచు నుంచి.... రెండవ వైపు వెలుపలి అంచు వరకు శుక్రుడు 400 నిమిషాల సేపు ప్రయాణం చేస్తాడు..... అంటే .... 6 గంటల 40 నిమిషాలు అన్నమాట. సూర్య బింబం ఓ వైపు లోపలి అంచు నుంచి... మరో వైపు లోపలి అంచు వరకు శుక్ర గ్రహణం కనపడే సమయము 364 నిమిషాలు.... అంటే.... 6 గంటల 4 నిమిషాలు అన్నమాట.
ఉత్తరార్ధ గోళములో ఈశాన్య స్పర్శతో ప్రారంభమైన గ్రహణ శుక్రుడు... వాయివ్య భాగంలో మోక్షమునొందును. ఆద్యంతం పుణ్యకాలము 6గంటల 4 నిమిషాలు అన్నమాట. భారత కాలమానం ప్రకారం 2012 జూన్ 6 సూర్యోదయానికి పూర్వము 3 గంట 21 నిమిషములకు శుక్రుడికి గ్రహణం స్పర్శించును. ఈ స్పర్శను భారతంలో రాత్రి సమయమందున వీక్షించలేము. శుక్ర గ్రహణ మధ్య కాలము 6 ఉదయం 6 గంటల 59 నిమిషాలు. శుక్ర గ్రహణ అంత్య కాలము ఉదయము 10 గంటల 01 నిమిషములు. భారతదేశంలో సూర్యోదయాలు జరిగనప్పటి నుంచే, అన్ని ప్రాంతాలలో నల్లని గుండుసూదిమొన లాంటి మచ్చతో శుక్ర గ్రహణం దర్శనమగును.... అంటే మచ్చతోనే సూర్యబింబం దర్శనమిస్తుంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర అమెరికాలో వాయువ్య భాగం, పచ్చిమ ఫసిఫిక్, ఉత్తర ఆశియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాతాలలో శుక్ర గ్రహణం కనపడుతుంది. పోర్చుగల్, దక్షిణ స్పెయిన్, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో గ్రహణం కనబడదు.
ఈ 2012 లో కనపడే శుక్ర గ్రహణ సమయంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. శుక్ర గ్రహణం రావాలంటే.... ఆ సమయంలో శుక్ర మూడమి ఏర్పడి వుండాలి. శుక్ర మూడమి ఏర్పడకుండా శుక్ర గ్రహణం రానేరాదు. అందుచేత జూన్ 2012 మొదటి పది రోజులలో శుక్ర మూడమి వుంటుంది. 2012 లో సీ.... రియల్ పోస్టింగ్స్ లో ఈ వ్యాసాన్ని మొదటిగా భావించండి.. ఈ గ్రహణ ఫలితాలు ఎలా వుంటాయి అనే ఆసక్తికర అంశాలకై 2012 వరుస పోస్టింగ్స్ ని క్రమం తప్పకుండా చదవండి... విశేషాలకై ఎదురు చూస్తూ వుండండి.. ..
Thursday, July 23, 2009
నాగపంచమిన నాగవల్లీ పత్రంతో నాగారాధన

ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే ఆషాడ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో 22 జూలై 2009 న జరిగిన విశేషం మనకు తెలిసినదే.......... ఈ సంపూర్ణ గ్రహణం ఉత్తర భారతదేశంలో పుణ్యక్షేత్రమైన గయా, వారణాసి, ఉజ్జయినీ లలో సంపూర్ణంగా గోచరించినది...... అలాగే ఉత్తరాయణం ప్రారంభమైన రెండవ రోజే, అనగా పుష్య అమావాస్య 14 జనవరి 2010 న మకర రాశిలో రాహుగ్రస్తంగా సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రామేశ్వరం, తిరుచందూర్ లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో కంకణంతో దర్శనం కాబోతున్నది.
ప్రతి సంవత్సరం ఆషాడ అమావాస్య, పుష్య అమావాస్య దినములలో పుణ్య నదులలో స్నానాలు ఆచరిస్తూ.... పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయటం సనాతన భారతీయ సాంప్రదాయం. అయితే ఈ రెండు అయనాలు ప్రారంభమైన వెంటనే గ్రహణాలు రావటంచేత, హిందువులకు ఆధ్యాత్మికంగా స్నానాలు ఆచరించే, పై అమావాస్య రోజులు గ్రహణ రోజులు కావటం ఒక పుణ్యంగా భావించాలి.
మకర సంక్రాంతి పర్వదిన తదుపరి వచ్చే పుష్య అమావాస్య సూర్యగ్రహణ స్నానానికి మరో ప్రత్యేకం కూడా వుంది.... ఏమిటంటే 14.04.2010 మహా కుంభమేళ సప్త పవిత్ర స్నానాలలో....... ఈ పుష్య అమావాస్య గ్రహణ స్నానం ఒకటి కావటం మహా అదృష్టం. గనుక శ్రీ విరోధి నామ సంవత్సరం లో ఆషాఢ, పుష్య అమావాస్యలలో జగద్రక్షకుడైన శ్రీసూర్యభగవానుడికి రాహు కేతు గ్రస్తంగా గ్రహణాలు సంభవించిన కారణంగా...... మనమంతా లోక కల్యాణం కోసమే కాక మన మన వ్యక్తిగత సంరక్షణార్ధం కూడా భగవంతుడిని ఆరాధించవలసి వుంది....... ఎన్నో... ఎన్నెనో... ఆరాధనలు వున్నాయి. వాటితోపాటు చాలా సులువుగా వుండే ఓ చక్కని నాగారాధన ఈ విరోధి నామ సంవత్సరంలో మనం ఆచరించవలసి వుంది. ఏమిటంటే..

గనుక, 26 ఆదివారం నాడు ఎనిమిది తమలపాకులను తీసుకొని, దానిపై మంచి తేనెను రాసి ... నాగదేవతను ఆరాధించే పుట్ట దగ్గరగానీ, నాగ ప్రతిమల వద్ద గానీ పై చిత్రంలో చూపిన విధంగా..... మధ్యలో పసుపు కుంకుమలను వుంచి, దానికి ఎనిమిది వైపులా తేనె రాసిన తమలపాకులను పెట్టి..... సూర్య భగవానుడి వైపు చూస్తూ మనసులోని కోర్కెను తెలియచేస్తూ నాగ దేవతకు ఈ ఎనిమిది ఆకులను నివేదించండి... అంతే ఆరాధన పూర్తి అయినది . ఇవిగాక ఇంకా ఇంకా మీరు నైవేద్యాలు సమర్పించాలంటే ...సమర్పించండి వానిలో ఎటువంటి మార్పు లేదు.... ఈ ఎనిమిది తేనె పూసిన ఆకులు మాత్రమే ఈ నాగపంచమికి ప్రత్యేకం.
ఎనిమిది ఆకులే ఎందుకు? తొమ్మిది వుంచవచ్చు కదా !!... అష్ట దిక్కులకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఎనిమిది ఆకులను వుంచుతున్నాం. ఓ సర్పదేవతకు తల భాగాన్ని రాహువుగానూ. తోక భాగాన్ని కేతువు గానూ పురాణ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా, పిలుచుకుంటాం. ఈ రాహు కేతు గ్రస్తాలతో ఏర్పడిన ఈ గ్రహణాలలో ప్రారంభంలోనే నాగపంచమి పర్వదినాన నాగవల్లీ పత్రంతో రాహు కేతువుల ప్రీతికి ఆరాధన చేసి, నాగదేవత కృపకు పాత్రులుకండి....... శ్రీనివాస గార్గేయ
Monday, July 20, 2009
గ్రహణం రోజున దైవ దర్శనమా ?

సూర్యచంద్ర గ్రహణాల రోజున దైవ దర్శనాలను నిలపాలని, గర్భాలయాన్ని మూసివుంచాలని శాసించే ధర్మశాస్త్ర గ్రంధాలు ఎన్నో వున్నాయి కానీ గ్రహణాలలో శ్రీ కాళహస్తి గర్భాలయాన్ని మూయకూడదని, భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పే వివరం, ఏ ధర్మశాస్త్ర గ్రంధంలో, లేక ఏ శైవాగమ గ్రంధంలో వున్నదో ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత శ్రీ కాళహస్తి దేవస్థాన పాలకమండలికి, పండితులకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు వుంది. కేవలం ఆలయ అర్చకులు చూపే ఏవో చిన్నిపాటి కారణాలు కాక, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ముక్కంటికి మచ్చ లేకుండా చేయాల్సిన అవసరం వుంది.
ఈ విరోధిలో ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే 2009 జూలై 22 సంపూర్ణ సూర్య గ్రహణము, 15 జనవరి 2010 అతిపెద్ద కంకణ సూర్య గ్రహణము సంభవించనున్నది. ఉత్తరాయనము ప్రారంభమైన రెండవ రోజే కుంభమేళ పవిత్ర స్నాన సందర్భములో ఈ గ్రహణము ఓ ప్రపంచారిష్టం. ప్రజలు భయపడవలదని మా మనవి.
కనుక ఆయా రోజులలో శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని తెరవకుండా వుంచి, భక్తులకు దర్శనాలను ఆపవలెనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులకు వినయముగా తెలియజేయుచున్నాను. లేదా ఆలయాన్ని తెరవవచ్చు అని చెప్పే సరియైన సక్రమమైన అసలుసిసలైన ప్రామాణిక గ్రంధాన్ని చూపెట్ట వలసిన భాద్యత వున్నదని గుర్తుచేస్తున్నాను. ప్రజల క్షేమంకోరే ఈ వార్త వ్రాయటం జరిగింది. అంతేకాని ఆలయ పండితుల మీద అక్కసుకాదని గ్రహించేది. మీడియా ప్రభంజనం ఉన్న నేటి రోజులలో జనవిజ్ఞానవేదిక నుంచి వచ్చే సూటి ప్రశ్నలకు మనం కూడా ఖచ్చిత ప్రమాణాలను చూపించాల్సిన అవసరం వుంది. - శ్రీనివాస గార్గేయ.
Tuesday, July 7, 2009
కోటి రూపాయల బహుమతి

