Wednesday, June 9, 2010

వరుసగా కూలుతున్న ధ్వజ స్తంభాలు అరిష్టానికి సంకేతాలా ?

మే ఇరవై ఆరవ తేదీన శ్రీ కాళహస్తి గాలి గోపురం కూలిపోవటం తదుపరి ఆంద్ర రాష్ట్రానికి అరిష్టాలుగా ధ్వజ స్తంభాలు శివాలయాలలో నేలకొరిగిపోతున్నాయి. లయకారకుడైన ముక్కంటికి కోపం వచ్చిందా ? ఆంద్ర రాష్ట్రానికి రాబోయే రోజులలో సమస్యలు ఎదురుకానున్నాయా? కేవలం శివాలయాలలోనే ధ్వజాలు ఎందుకు పడిపోతున్నాయి ? గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో శివాలయంలోని నంది స్పష్టంగా కంట తడిపెట్టడం రెండు రోజుల క్రితం మీడియాలో విసువల్స్ చూసిన వారికి బాగా తెలిసి వుంటుంది.

జూన్ మూడవ తేది వరంగల్ జ్కిల్లాలో ఓ ధ్వజ స్థంభం ఒరిగిపోవటం, ఆపై రెండు రోజుల్లకు విశాఖ జిల్లాలో మరో ధ్వజం పడిపోవటం, ఈరోజు ఏకంగా మూడు ధ్వజాలు నేలకొరగటం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే ప్రకాశం జిల్లాలో ఈరోజే ప్రతిష్ట చేస్తున్న ఓ రాతి ధ్వజ స్థంభం అనుకోకుండానే రెండు ముక్కలు కావటం ప్రజల మనసులను కలవర పెడుతున్నాయి. మే ఇరవై ఆరు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇలా ధ్వజాలు పడిపోవటం ఆంద్ర రాష్ట్రానికి మహా అరిష్టమనేది మరో రకంగా చెప్పనవసరం లేదు.

మే తొమ్మిది 2010 పూర్వాభాద్ర అనే గురు నక్షత్రంతో మొదలై మే ఇరవై ఆరు విశాఖ అనే గురు నక్షత్రం వరకు మీనం అనే జల రాశి నుంచి కర్కాటకం అనే జల రాశి వరకు అయిదు రాశులలో అయుదు గ్రహాలూ వుండి, డిగ్రీలలో చూసినప్పుడు కుజును యొక్క ఆచ్చాదన గురువుపై వుండటం ఓ అరిష్టమనే సంగతి భక్తి టీవీలో ఇరవై అయుదు రోజుల క్రితమే చెప్పటం జరిగినది. ఇకపై రాబోయే రోజులలో ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ శుభిక్షంగా ఉండటానికి, లయకారకుడైన శుభంకరుడైన ఆ శంభోశంకరుడిని ఆనంద తాండవ మొనర్చే విధంగా ఉండాలంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖవారు శివాలయాలలో జరిగే స్వామివారికి అపచారాలు జరగకుండా ఉపచారాలు జరిగేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో ఈ అరిష్టాలు పెరిగి మొదటికే మోసం రాగలదు. తస్మాత్ జాగ్రత్త

1 comment:

  1. గ్రహాలకు అధిపతి శివునికి కూడా గ్రహపీడ వుంటుందా?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.