జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి ఊరించిన ఋతుపవనాలు చివరకు నిరాశ మిగిల్చాయి. ఈ యేడాది దేశం మొత్తం మీద నైరుతి ఋతుపవనాల ప్రభావము సాధారణము కంటే తక్కువే వుంటుందని కేంద్ర భూశాస్త్ర విభాగ మంత్రి పృధ్వీ రాజ్ ఢిల్లీలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో కనీస వర్షపాతమైనా నమోదు కావాలి. ప్రస్తుతం నేల తదిసేవరకు కూడా పడటం లేదు. పూర్తిగా రాష్ట్రం అంతా వర్షాభావం అలుముకుంది. భారత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానేవుంది. ఇప్పటికే మాంద్యంతో కృంగి పోయిన ఆర్ధికవ్యవస్థకు వర్షాభావ హెచ్చరిక శరాఘాతం కానుంది.
పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వుండటానికి వరుణయాగాలు, ప్రార్ధనలు చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపాలని ప్రభుత్వం వారు.... అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పెద్ద, 1819 చిన్న ఆలయాలలో కలిసి మొత్తం 1938 దేవాలయాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవదాయ, ధర్మదాయ ( దేవాదాయ, ధర్మాదాయ కాదు ) శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలిపారు.
ఈ నేపధ్యం లో తిరుమలలో వరుణ జపాలు, ప్రత్యక పూజలు నిర్వహించనున్నట్లు టి.టి.డి. చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. గత యేడాది దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి వరుణ యాగం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 108 హోమగుండాలతో జూలై 2 నుంచి 4 వరకు వరుణయాగం చేయనున్నారు టి.టి.డి. వారు.
అయితే మేము తెలియచేసే వివరాలు ఏమిటంటే గతంలోనూ, ఎన్నోసార్లు వరుణయాగాలు చేసి విజయం సాధించని దాఖలాలు వున్నవి. దీనివలన యాగాల కొరకు సొమ్మును వృధా చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నవి.వరుణయాగం చేయాలనుకున్నప్పుడు కేవలం సేవాభావంతో, భక్తి తత్పరతతో, విశ్వాసంతో సరైన నక్షత్ర బలంతో పునాది వేస్తే, ఆ భక్తిచే భగవంతునితో బంధం ఏర్పడుతుంది. గనుక ప్రాధమిక విషయాలు గుర్తించకుండా, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి.... ఫలితాలు రాకపోతే, ఇతరులచే నిందింపబడేదానికన్నా........ ముందుగా జ్యోతిష్య పండితులలో సిద్ధహస్తులైన వారితోనే ప్రభుత్వ అధికారులు చర్చలు జరపాలి........ఏమి చర్చలు ?..... దేని కోసం?
నాచే రచింపబడిన శ్రీ విరోధి సంవత్సర " గ్రహభుమి " పంచాంగం ( పేజీ నెంబర్ 31 ).... " కాలచక్రం " పంచాంగం ( పేజీ నెంబర్ 40 ) లలో ఆఢక మేఘ వాయి నిర్ణయాలు అనే శీర్షికలో జూన్ ఆఖరి నాటి పరిస్థితి తెలియజేస్తూ "త్రాగునీటికి తీవ్ర ఎద్దడి యేర్పడును. ఋతుపవనాలకై వేచి వుందురు." జూలై 4 వ తేది తరువాత వాతావరణము ఆంద్రప్రదేశ్ లో కొన్నిచోట్ల చల్లబడును. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినప్పటికీ ఫలితం తక్కువ" అని వ్రాసాను.
నా పంచాంగం లో జూలై 4 తరువాత వాతావరణం చల్లబడును అని వుంది గనుక, 4 వ తేదీతో వరుణయాగం ముగిస్తే.... విజయం పొందామని ఊహించవచ్చు.......... కాని ఫలితం తక్కువేనని నేనంటున్నాను. ఎందుకంటే.... వరుణయాగం చేసే సమయంలో ముఖ్యంగా చంద్రుడు జల సంబంధ రాశులలో వుంది తీరాలి అప్పుడే యాగం విజయవంతమవుతుంది. అనగా చంద్రుడు కర్కాటక, మీన , మకర, రాశులలో వుండి ఇతర గ్రహ సంచారం అనుకూలంగా వుండాలి. అలాంటప్పుడు జూలై 8,9,10 తేదీలలో వరుణయాగ సంబంధిత వేదమంత్రాలు, వరుణప్రియ, అమృతవర్షిణి రాగాలతో సంగీత ఝరి ఏర్పాటు చేస్తే తప్పక వరుణ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు.
కాబట్టి టి.టి.డి వారు జూలై 2,3,4 తేదీలు కాకుండా జూలై 8,9,10 తేదీలలో వరుణయాగం ఏర్పాటు చేస్తే, చంద్రుడు మకర రాశిలో వున్నందున పూర్ణ ఫలితం లభిస్తుంది. చెప్పేటంతవరకే నా కృషి..... వినని వారిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.................. శ్రీనివాస గార్గేయ
Showing posts with label సంపాదకీయం. Show all posts
Showing posts with label సంపాదకీయం. Show all posts
Thursday, June 25, 2009
Monday, June 22, 2009
ముక్కంటీశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా?

శివుడంతటివాడే పోయి చెట్టు తొర్రలో కూర్చున్నాడట....... మనం తరచుగా వింటూ వుంటాము ఈ వాక్యాన్ని. తిరుమల మూడునామాల వెంకన్న స్వామిది శ్రవణా నక్షత్రం...మకర రాశి. పాపం.... ఆ స్వామి అష్టమశని వేదనతో 2007 జూలై నుంచి బాధపడుతున్నాడు.అందుకే ఏదో ఒక కారణంతో నిత్యం తిరుమలేశుడు మీడియాలోకి ఎక్కుతున్నాడు. ఒకసారి గొలుసు తెగిందని.....వస్త్రం అంటుకున్నదని, జ్యోతులు కొండెక్కాయని, ఊరేగింపులో వాహనానికి తల లేదని, ఎన్నో....ఎన్నెన్నో అపచారాలతోను.....అర్చకుల కుమ్ములాటతోను....వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల అష్టకష్టాలతోనూ.... అబ్బబ్బ... స్వామిని అష్టమశని ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఈ స్వామి 2009 సెప్టెంబర్ 9 వ తేదీతో అష్టమశని బారి నుంచి విముక్తి కానున్నాడు. అంతవరకు వెంకన్న స్వామికి తిప్పలు తప్పవు.
కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ సంగతిని అర్ధం చేసుకోనరు. అక్కడ యాగాలు.... ఇక్కడ యాగాలు అంటుంటారు తప్ప. స్వామివారికి శని వేదన నుంచి రక్షించే యాగానికి సన్నద్ధం కారు. నా లాంటివాడు నా పంచాంగం "కాలచక్రం", "గ్రహభుమి" లో ముందుగా చెప్పినా, ఆలకించిన వారూ లేరు...
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..... ఆ ప్రక్కనే వున్న శ్రీకాళహస్తి ముక్కంటిస్వామీ మీడియా గోలలో ఎక్కడ ఇరుక్కుంటానని అనుకున్నాడేమో! ఎందుకో తెలుసా? వెంకన్న స్వామీ తరువాత తన వంతు అవుతుంది....... ఎందుకని ?........ తనది ఆర్ద్ర నక్షత్రం... మిధున రాశి... 9 సెప్టెంబర్ 2009 నుంచి తనకు అర్ధాష్టమ శని పట్టుకుంటాడు. ఇక నిత్యం మీడియాలో నానాలి. పైగా ఆంధ్రరాష్టంలో పాతికపైగా ఛానళ్ళు వున్నాయి. కెమెరాలు, గొట్టాలు పట్టుకొని గుడికి వస్తారు....నిమిషాల మీద లైవ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తారు.....అమ్మో..... ఇంత దారుణం నుంచి గాలిస్వామి బయట పడాలనుకున్నాడెమో!...... ఇక తనకు తిప్పలు తప్పవు...... ఈ తిప్పలు తప్పుకోవాలంటే ..... ఓ రక్షక కవచం తనకు కావాలనుకున్నాడు.
అసలే వాయులింగేశ్వరుడు...... ఇంకేముంది!.. గాలిలో ఎస్.ఎం.ఎస్ పంపాడు. ఎవరికీ? కర్ణాటకలోని గాలి కరుణాకర రెడ్డి కి ....కరుణాకర! నీ సోదరుడు మూడు నామాల స్వామికి కిరీటం చేయించాడు. మరి ఈ మూడు నేత్రాల స్వామికి తక్షణం నవగ్రహ కవచం చేయించు. జ్యోతిష్య పండితులు అర్ధాష్టమ శని వస్తుందని అంటున్నారు.....తక్షణమే సిద్ధం చేయ్ అని హుకుం జారి అయింది కరుణాకర్ కి .
పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడుగా ప్రశిద్ధినొందిన శ్రీకాళహస్తీశ్వరుడు ఇకపై నవరత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు నవగ్రహ కవచంతో భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నాడు. స్వర్ణ శోభితమైన నవరత్న మయమైన నవగ్రహ అలంకార కవచాన్ని 60 లక్షల రూపాయలతో వాయు లింగ ( గాలి ) స్వామికి బహుకరించారు కర్నాటక రాష్ట్ర రెవిన్యు మంత్రివర్యులు గాలి కరుణాకర రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.
ఈ నవగ్రహ కవచంలో 27 నక్షత్రాలు, నవగ్రహాలు మలిచారు. ఒక్కో నక్షత్రానికి 27 వజ్రాల ప్రకారం 729 వజ్రాలను పొదిగారు. జ్యేష్టమాస సోమ అమావాస్య ముందు రోజు ఆదివారం 21 జూన్ 2009 న శ్రీకాళహస్తి లోని స్థానిక త్రినేత్ర అతిధి గృహం నుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నవగ్రహ కవచాన్ని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకొని వచ్చారు గాలి కుటుంబ సభ్యులు.
ఈ గాలి స్వామికి గాలి సోదరుల వితరణ చేసిన నవగ్రహ కవచంతో.....
తాను అర్ధాష్టమ శని బారి నుంచి తట్టుకొని......
తన చెంతకు వచ్చే భక్తులను చల్లగా అనుగ్రహిస్తాడని ఆశిద్దాం................శ్రీనివాస గార్గేయ
కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ సంగతిని అర్ధం చేసుకోనరు. అక్కడ యాగాలు.... ఇక్కడ యాగాలు అంటుంటారు తప్ప. స్వామివారికి శని వేదన నుంచి రక్షించే యాగానికి సన్నద్ధం కారు. నా లాంటివాడు నా పంచాంగం "కాలచక్రం", "గ్రహభుమి" లో ముందుగా చెప్పినా, ఆలకించిన వారూ లేరు...
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..... ఆ ప్రక్కనే వున్న శ్రీకాళహస్తి ముక్కంటిస్వామీ మీడియా గోలలో ఎక్కడ ఇరుక్కుంటానని అనుకున్నాడేమో! ఎందుకో తెలుసా? వెంకన్న స్వామీ తరువాత తన వంతు అవుతుంది....... ఎందుకని ?........ తనది ఆర్ద్ర నక్షత్రం... మిధున రాశి... 9 సెప్టెంబర్ 2009 నుంచి తనకు అర్ధాష్టమ శని పట్టుకుంటాడు. ఇక నిత్యం మీడియాలో నానాలి. పైగా ఆంధ్రరాష్టంలో పాతికపైగా ఛానళ్ళు వున్నాయి. కెమెరాలు, గొట్టాలు పట్టుకొని గుడికి వస్తారు....నిమిషాల మీద లైవ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తారు.....అమ్మో..... ఇంత దారుణం నుంచి గాలిస్వామి బయట పడాలనుకున్నాడెమో!...... ఇక తనకు తిప్పలు తప్పవు...... ఈ తిప్పలు తప్పుకోవాలంటే ..... ఓ రక్షక కవచం తనకు కావాలనుకున్నాడు.
అసలే వాయులింగేశ్వరుడు...... ఇంకేముంది!.. గాలిలో ఎస్.ఎం.ఎస్ పంపాడు. ఎవరికీ? కర్ణాటకలోని గాలి కరుణాకర రెడ్డి కి ....కరుణాకర! నీ సోదరుడు మూడు నామాల స్వామికి కిరీటం చేయించాడు. మరి ఈ మూడు నేత్రాల స్వామికి తక్షణం నవగ్రహ కవచం చేయించు. జ్యోతిష్య పండితులు అర్ధాష్టమ శని వస్తుందని అంటున్నారు.....తక్షణమే సిద్ధం చేయ్ అని హుకుం జారి అయింది కరుణాకర్ కి .
పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడుగా ప్రశిద్ధినొందిన శ్రీకాళహస్తీశ్వరుడు ఇకపై నవరత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు నవగ్రహ కవచంతో భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నాడు. స్వర్ణ శోభితమైన నవరత్న మయమైన నవగ్రహ అలంకార కవచాన్ని 60 లక్షల రూపాయలతో వాయు లింగ ( గాలి ) స్వామికి బహుకరించారు కర్నాటక రాష్ట్ర రెవిన్యు మంత్రివర్యులు గాలి కరుణాకర రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.
ఈ నవగ్రహ కవచంలో 27 నక్షత్రాలు, నవగ్రహాలు మలిచారు. ఒక్కో నక్షత్రానికి 27 వజ్రాల ప్రకారం 729 వజ్రాలను పొదిగారు. జ్యేష్టమాస సోమ అమావాస్య ముందు రోజు ఆదివారం 21 జూన్ 2009 న శ్రీకాళహస్తి లోని స్థానిక త్రినేత్ర అతిధి గృహం నుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నవగ్రహ కవచాన్ని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకొని వచ్చారు గాలి కుటుంబ సభ్యులు.
ఈ గాలి స్వామికి గాలి సోదరుల వితరణ చేసిన నవగ్రహ కవచంతో.....
తాను అర్ధాష్టమ శని బారి నుంచి తట్టుకొని......
తన చెంతకు వచ్చే భక్తులను చల్లగా అనుగ్రహిస్తాడని ఆశిద్దాం................శ్రీనివాస గార్గేయ
Sunday, June 21, 2009
9 వ సం.. 9 వ నెల.. 9 వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల.. 9 సెకన్లకు... ఏమవుతుంది ?
9 వ సం.. 9 వ నెల.. 9వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల... 9 సెకన్లకు... ఏమవుతుంది ప్రపంచంలో. అనే ఆత్రుత అందరిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 6 తొమ్మిది అంకెలను కలపగా 54 మొత్తం వస్తుంది. ఈ రెండు అంకెలను కలిపితే మరల తొమ్మిది సంఖ్య వస్తుంది. తొమ్మిది సంఖ్య కుజగ్రహానికి ప్రతీక. ఇలా ప్రతి సంవత్సరం ఒక అంకె ప్రత్యేకంగా వస్తూనే ఉంటుంది. అలా ప్రత్యేకంగా వచ్చిన రోజును కొంతమంది అదృష్టంగా భావిస్తే, మరికొంత మంది అరిష్టంగా భావిస్తారు. గత 2008 లో ఆగష్టు 8 న బీజింగ్ లో ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. మరి ఈ 2009 లో ప్రత్యేకత ఏమిటి? ఖగోళ ప్రత్యేకత ఏమిటి? శాస్త్ర ప్రత్యేకత ఏమిటి?...
ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే ఒకే అంకె రావటం మామూలే. అయితే ఖగోళంలో శని గ్రహం ఈ రోజే సింహరాశి నుంచి కన్యారాశికి ప్రయాణమై వెళుతుంది. ఈ రోజుతోనే మకర మాలికా యోగ అరిష్టం వెడుతుంది. ఈనాటి నక్షత్రం భరణి. ఈ రోజును భరణీమహాలయం అని పిలుస్తారు. పితృదేవతల కాలమే మహాలయపక్షాలు. దీనినే పితృపక్షంగా చెప్తారు. భరణీ నక్షత్రానికి యముడు అధిపతి. ఖచ్చితంగా పైన తెల్పిన ఆరు తొమ్ముదులు తులా లగ్నంలో వుంటాయి. తుల లగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర నక్షత్రమే భరణీ. ఈ భరణీ నక్షత్రముండేది మేషరాశిలో. ఈ మేషరాశి అధిపతి కుజుడు. విచిత్రమేమంటే పై ఆరు తొమ్మిది సంఖ్యలు తులా లగ్నంలో వస్తుంటే, తొమ్మిది సంఖ్యకు అధిపతైన కుజుడు తులా లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలోనే వున్నాడు. తమాషాగా ఉంది కదూ!
ఇలా కబుర్లు చెప్తూపోతే కొండవీటి చేంతాడంత అవుతుంది. ఇదంతా మనకి అనవసరం. కాకతాళీయంగా ఈనాడు భరణీ మహాలయం వచ్చింది. శని కన్యా రాశికి వస్తున్నాడు. మకర మాలికా యోగ దుష్ఫలితాలు పోతున్నాయి. వృషభ, మకర, కర్కాటక రాశులవారు ఎంతో సంతోషంతో వుండాలి. ఎందుకో తెలుసా? శని వేదనల నుంచి విముక్తి. మరి మిధున, కుంభ, తులారాశులవారు శని వేదనలోకి వెడతారు. కనుక ఈ భరణీమహాలయం రోజున పితృదేవతలని స్మరించండి. శుభాలు జరగాలని కోరుకోండి. తెల్లవారితే తొమ్మిది పోతుంది. తమాషాగా బాగుంది కదూ! ....
...............................శ్రీనివాస గార్గేయ
ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే ఒకే అంకె రావటం మామూలే. అయితే ఖగోళంలో శని గ్రహం ఈ రోజే సింహరాశి నుంచి కన్యారాశికి ప్రయాణమై వెళుతుంది. ఈ రోజుతోనే మకర మాలికా యోగ అరిష్టం వెడుతుంది. ఈనాటి నక్షత్రం భరణి. ఈ రోజును భరణీమహాలయం అని పిలుస్తారు. పితృదేవతల కాలమే మహాలయపక్షాలు. దీనినే పితృపక్షంగా చెప్తారు. భరణీ నక్షత్రానికి యముడు అధిపతి. ఖచ్చితంగా పైన తెల్పిన ఆరు తొమ్ముదులు తులా లగ్నంలో వుంటాయి. తుల లగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర నక్షత్రమే భరణీ. ఈ భరణీ నక్షత్రముండేది మేషరాశిలో. ఈ మేషరాశి అధిపతి కుజుడు. విచిత్రమేమంటే పై ఆరు తొమ్మిది సంఖ్యలు తులా లగ్నంలో వస్తుంటే, తొమ్మిది సంఖ్యకు అధిపతైన కుజుడు తులా లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలోనే వున్నాడు. తమాషాగా ఉంది కదూ!
ఇలా కబుర్లు చెప్తూపోతే కొండవీటి చేంతాడంత అవుతుంది. ఇదంతా మనకి అనవసరం. కాకతాళీయంగా ఈనాడు భరణీ మహాలయం వచ్చింది. శని కన్యా రాశికి వస్తున్నాడు. మకర మాలికా యోగ దుష్ఫలితాలు పోతున్నాయి. వృషభ, మకర, కర్కాటక రాశులవారు ఎంతో సంతోషంతో వుండాలి. ఎందుకో తెలుసా? శని వేదనల నుంచి విముక్తి. మరి మిధున, కుంభ, తులారాశులవారు శని వేదనలోకి వెడతారు. కనుక ఈ భరణీమహాలయం రోజున పితృదేవతలని స్మరించండి. శుభాలు జరగాలని కోరుకోండి. తెల్లవారితే తొమ్మిది పోతుంది. తమాషాగా బాగుంది కదూ! ....
...............................శ్రీనివాస గార్గేయ
Subscribe to:
Posts (Atom)